శవమై కనిపించిన బీజేపీ మాజీ మంత్రి అల్లుడు

శవమై కనిపించిన బీజేపీ మాజీ మంత్రి అల్లుడు

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత బీసీ పాటిల్ అల్లుడు కేజీ ప్రతాప్ కుమార్(41) సోమవారం(జులై 08) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా అరకెర సమీపంలోని అటవీ ప్రాంతంలో అతను కారులో అపస్మారక స్థితిలో కనిపించారు. ఆత్మహత్యాయత్నం చేసి ఉంటాడని అనుమానించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు శివమొగ్గలోని మెక్‌గన్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

అతను అపస్మారక స్థితిలో కనిపించిన ప్రాంతంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. అయితే, కారులో విషం బాటిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, శ్రీ పాటిల్ కుమార్తె సౌమ్య పాటిల్‌ను 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ప్రతాప్ కుమార్ హవేరి జిల్లా హిరేకెరూరులో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు.