సీఎం సిద్దరామయ్య పిటిషన్ హైకోర్టు కొట్టివేత..ముడాస్కాం కేసులో విచారణ చేయాలి

సీఎం సిద్దరామయ్య పిటిషన్ హైకోర్టు కొట్టివేత..ముడాస్కాం కేసులో విచారణ చేయాలి

ముడా భూకుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్ద తగిలింది. ఈ కేసులో గవర్నర్ పై ఆయన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు తిరస్క రించింది. పిటిషన్ లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది. 

గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించుకుని స్వతంత్రంగా దర్యాప్తునకు అనుమతిని ఇవ్వడంలో తప్పు లేదని కర్ణాటక హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం. నాగప్రసన్న తోసిపుచ్చారు. ఫిర్యాదులలో వివరించిన వాస్తవాలు నిస్సందేహంగా దర్యాప్తు అవసరమని కోర్టు తెలిపింది. సీఎం సిద్ధరామయ్యపై దర్యాప్తునకు అనుమతిని మంజూరు చేసింది. 

Also Read :- మద్రాస్ హైకోర్టు ఘోర తప్పిదం చేసింది

14 మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల కేటాయింపులో జరిగిన అక్రమాలకు సంబంధించి, సిద్దారమయ్య భార్యకు ఇందులో అక్రమంగా భూములు కేటాయించారని తనపై దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతిచ్చారు.  గవర్నర్ సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు తన తీర్పును వెలువరించింది.