బెంగళూరు, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టుపై కర్నాటకలో కేసు నమోదైంది. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఇండియాలో సిక్కుల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలను రవ్నీత్ బిట్టు తప్పుపట్టారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ‘‘బాంబులు తయారుచేసే వ్యక్తి’’(గురుపత్వంత్సింగ్ పన్ను) మద్దతిస్తున్నారని.. రాహుల్ ఒక నం.1 టెర్రరిస్ట్ అని తీవ్రంగా విమర్శించారు.
రాహుల్ గాందీపై కేంద్రమంత్రి చేసిన కామెంట్లపై కర్నాటక పీసీసీ ప్రతినిధి ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో రవ్నీత్ బిట్టుపై కేసు నమోదు చేశారు.