ఆకట్టుకున్న సత్యం, సుందరం మైత్రి

ఆకట్టుకున్న సత్యం, సుందరం మైత్రి

కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. ‘96’ ఫేమ్  సి ప్రేమ్ కుమార్ దీనికి దర్శకుడు. 2డి ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని  నిర్మించారు. సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.  శుక్రవారం ఈ మూవీ తెలుగు టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. కార్తి, అరవింద్ స్వామిలను స్నేహితులుగా చూపిస్తూ సాగిన టీజర్ సినిమాపై ఇంటరెస్ట్‌‌‌‌ను కలిగించింది. వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్  బాండింగ్ ఆకట్టుకుంది.

 కార్తి అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే, అరవింద్ స్వామి అర్బన్ పర్సనాలిటీగా కనిపించాడు. గోవింద వసంత అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్‌‌‌‌ని ఎలివేట్ చేసింది. శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని  ఏషియన్ సురేష్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థ  తెలుగులో రిలీజ్ చేస్తోంది.