ఆరోజు మోహన్ బాబు నో చెప్పి ఉంటే సౌందర్య బ్రతికి ఉండేది: డైరెక్టర్ రాజేంద్ర

ఆరోజు మోహన్ బాబు నో చెప్పి ఉంటే సౌందర్య బ్రతికి ఉండేది: డైరెక్టర్ రాజేంద్ర

ఒకప్పుడు తెలుగు సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ స్వర్గీయ హీరోయిన్ సౌందర్య గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నటి సౌందర్య టాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలసి నటించింది. ఎలాంటి ఓవర్ ఎక్స్ పోజింగ్ లేకుండా చక్కటి, బొట్టు అందం అభినయంతో ప్రేక్షకులని అలరించింది. దీంతో తక్కువ సమయంలోనే దాదాపుగా 100 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అనుకోకుండా 2004లో  ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది.

అయితే సీనియర్ డైరెక్టర్ రాజేంద్ర నటి సౌందర్య మరణం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తాను ప్రముఖ హీరో మంచు మోహన్ బాబుతో తెరకెక్కించిన శివ శంకర్ షూటింగ్ సమయంలో సౌందర్య మరణించిందని తెలిపాడు. మామూలుగా షూటింగ్ సమయంలో మోహన్ బాబు ఇతర ఆర్టిస్టులకి సెలవులు ఇవ్వరని కానీ సౌందర్య ఎలక్షన్ల ప్రచారం అని చెప్పడం అలాగే మంచి సన్నిహిత సంబంధాలు ఉండటంతో సౌందర్యకి రెండు రోజులు షూటింగ్ సెలవులు ఇచ్చారట. 

ALSO READ | కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ప్రముఖ డైరెక్టర్ మృతి

ఆ సమయంలోనే సౌందర్య ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించిందని ఎమోషనల్ అయ్యాడు. ఒకవేళ సౌందర్యకి మోహన్ బాబు ఎన్నికల ప్రచారానికి పర్మిషన్ ఇవ్వకుంటే కచ్చితంగా సౌందర్య బ్రతికి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక శివ శంకర్ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే సౌందర్య మరణించడంతో aఅ సినిమాని సరిగ్గా తీయ్యలేకపోయామని దీంతో సినిమా ఫ్లాప్ అయ్యిందని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ రాజేంద్ర సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా పెద్దగా రాణించలేక పోయినప్పటికీ సీరియల్ ఇండస్ట్రీలో మాత్రం ఆడియన్స్ బాగానే అలరించాడు. ప్రస్తుతం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానెల్ అయిన స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను కట్టి పడేసింది. అలాగే టీఆర్పీ విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది.