
వాషింగ్టన్: అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) డైరెక్టర్గా భారత సంతతికి చెందిన కాష్పటేల్ ప్రమాణం చేశారు. శుక్రవారం వైట్హౌస్లో ఆయన చేత అటార్నీ జనరల్ పామ్ బోండీ ప్రమాణ స్వీకారం చేయించారు.
భారత మూలాలు ఉన్న కాష్ పటేల్ భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేయడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆయన గర్ల్ఫ్రెండ్ అలెక్సీస్ విల్కిన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాష్ పటేల్ మాట్లాడుతూ.. ఎఫ్బీఐ లో జవాబుదారీతనం ఉండేలా చూస్తానన్నారు.