కట్టమైసమ్మ.. చల్లంగా చూడమ్మా

కట్టమైసమ్మ.. చల్లంగా చూడమ్మా

జీడిమెట్ల, వెలుగు: సూరారం కట్టమైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. టెంట్​లు ఏర్పాటు చేసుకుని విందులు ఆరగించారు. 

పోతరాజుల ఆటలు, శివసత్తుల నృత్యాలతో జాతర ఉత్సాహంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సూరారం సీఐ భరత్​కుమార్​ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జీడిమెట్ల ట్రాఫిక్​ సీఐ శ్రీనివాస్​ఆధ్వర్యంలో ట్రాఫిక్​ను నియంత్రించారు. జాతర ఉత్సవాల్లో భాగంగా  సోమవారం రంగం, భవిష్యవాణి జరగనుంది. బుధవారం అన్న సమారాధనతో ఉత్సవాలు ముగియనున్నాయి.