![బోనస్ ఇష్యూకు కేబీసీ గ్లోబల్ గ్రీన్సిగ్నల్](https://static.v6velugu.com/uploads/2025/02/kbc-global-board-of-directors-gives-green-signal-to-bonus-issue-proposal_nDPQjKyp7B.jpg)
హైదరాబాద్, వెలుగు: నాసిక్ కేంద్రంగా పనిచేసే కేబీసీ గ్లోబల్ డైరెక్టర్ల బోర్డ్ బోనస్ ఇష్యూ ప్రతిపాదనకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రతి షేర్ హోల్డర్కు ఒక్కో షేరు చొప్పున ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీ పేరుతో ధరణ్ ఇన్ఫ్రా–ఈపీసీ లిమిటెడ్గా మార్చడానికి అంగీకారం కుదిరింది.
అప్పులను భారీగా తగ్గించుకుని వ్యాపారాన్ని విస్తరిస్తామని కేబీసీ ప్రకటించింది. ఆథరైజ్డ్ క్యాపిటల్ పెంపు, కంపెనీ పేరు మార్పుకు బోర్డు అంగీకరించిందని ప్రకటించింది. ఆర్డర్ బుక్ విలువ రూ.200 కోట్లు ఉందని తెలిపింది. తాజాగా పతంజలి ఫుడ్స్, ఫాల్కన్ పీక్ ఫండ్ కేబీసీలో రూ.99.50 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.