
కేసీఆర్ అంటే వ్యక్తి కాదు, నాయకుడు కాదని, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘కేసీఆర్ కారణజన్ముడు. 16 ఏండ్ల వయసులోనే జై తెలంగాణ అంటూ ఉద్యమంలో పాల్గొన్నారు. నాడు తెలుగు దేశం పార్టీలో పనిచేసినా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తూనే ఉండేవారు. వందలు, వేల గంటల మేధోమథనం తర్వాత తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతో శ్రమించారు. మొండి ధైర్యంతో పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు.. దటీజ్ కేసీఆర్” అని పేర్కొన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి ట్వంటీ ట్వంటీ మ్యాచులు ఆడుతున్నానంటున్నారు. కానీ, ఆయన ఆడుతున్నది తొండి మ్యాచులు. నీ(రేవంత్) మాటల్లో తొండి, హామీల అమల్లో తొండి. కానీ కలెక్షన్లలో మాత్రం ట్వంటీ ట్వంటీ.
కేసీఆర్ ఏదైనా ఆడగలడు.. టెస్టు, వన్ డే, ట్వంటీ ట్వంటీ ఏదైనా అద్భుతంగా ఆడుతడు. ఎప్పుడు ఏది ఆడాల్నో కేసీఆర్కు బాగా తెలుసు. అవసరం అయితే డిఫెన్స్ అడుతడు, అవసరం అయితే సిక్స్ లూ కొడుతడు’’ అని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ మొండి పట్టుదల, పోరాటం వల్లేనని అన్నారు. ఫిబ్రవరి 17 ఎంత ముఖ్యమో.. నవంబర్ 29 కూడా అంతే ముఖ్యమని హరీశ్ తెలిపారు.