రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మాదిరిగానే గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో కూడా 2017 ఫిబ్రవరి 3న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ. కోటి ఖర్చు అవుతుందని అంచనా వేసినప్పటికీ పూర్తయ్యేసరికి రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సుమారు వెయ్యి గజాల స్థలంలో, ఆధునిక హంగులతో నిర్మించిన ఈ బిల్డింగ్ ఆరేండ్ల కిందే పూర్తయింది.
నాటి నుంచి నేటి వరకు సీఎంగా గానీ, గజ్వేల్ ఎమ్మెల్యేగానీ కేసీఆర్ ఏనాడూ ఈ క్యాంప్ ఆఫీస్కు రాలేదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆరే గెలిచారు. అప్పటి నుంచి గజ్వేల్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఫామ్హౌజ్లో ఉంటున్నారు తప్పితే ఒక్కసారి కూడా క్యాంప్ ఆఫీస్లో అడుగుపెట్టలేదు. ‘మా సారు (కేసీఆర్) ఎన్నడూ ఇక్కడకు రాలేదు’ అని భవనం బాగోగులు చూస్తున్న ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు.