నమ్మిన సిద్ధాంతంకోసం.. 

నమ్మిన సిద్ధాంతంకోసం.. 

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకుని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది కీర్తి సురేష్.   ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గానూ  తనదైన నటనతో మెప్పిస్తోంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘రఘు తాత’ చిత్రం ఆగస్టు 15న విడుదలై థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.  ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి  జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘నమ్మిన దాని కోసం నిలబడే ఓ ధైర్యశాలి పాత్రను ఈ చిత్రంలో పోషించడం ఆనందంగా ఉంది.  ఆ పాత్రకు జీవం పోయడం  సవాలుగా అనిపించింది. ఇప్పుడు  జీ5 ద్వారా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ అవుతుండటం సంతోషంగా ఉంది’ అని చెప్పింది.  

సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఎమోషనల్ జర్నీగా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అని దర్శక నిర్మాతలు అన్నారు.