కీసరలో ప్రైవేట్​ ఆస్పత్రి నర్సు అనుమానాస్పద మృతి... కేసు నమోదు

కీసరలో ప్రైవేట్​ ఆస్పత్రి నర్సు అనుమానాస్పద మృతి... కేసు నమోదు

మేడ్చల్ జిల్లా  కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని  సరిత సుధాకర్ హాస్పటిల్ నర్స్ కావ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, గోళ్లగూడెం గ్రామానికి చెందిన  కావ్య 8 నెలలుగా  సరిత సుధాకర్​ ఆస్పత్రిలో నర్స్​ గా పని చేస్తుంది.అకస్మాత్తుగా కావ్యకు జ్వరం రావడంతో డాక్టర్​ సుధాకర్​ ఆమెను ఇంటికి పంపారు.  ఆ తరువాత రెండు రోజులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కావ్య మృతి చెందింది.  కీసర పోలీస్​ స్టేషన్​ లో కావ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో .. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. 

ALSO READ | రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు