గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్‎ స్కీమ్‎పై ప్రభుత్వం కీలక ప్రకటన

గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్‎ స్కీమ్‎పై ప్రభుత్వం కీలక ప్రకటన

అమరావతి: రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఇవాళ (సెప్టెంబర్ 18) ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ దీపావళి నుండి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్‎ను అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని.. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పేదలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. సీఎం  చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. 

ఈ భేటీలో పలు  కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నవంబర్ నుండి ప్రభుత్వం అర్హులకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనుంది. ఈ ఏడాది మేలో   జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ మెజార్టీతో పవర్‎లోకి వచ్చిన కూటమి.. ఎన్నికల హామీల అమలుపై పెట్టింది. ఇందులో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై ఇవాళ ప్రకటన వెలువడింది.