తెలంగాణకు నెక్ట్స్ సీఎం బీసీ వ్యక్తే: MLC తీన్మార్ మల్లన్న

తెలంగాణకు నెక్ట్స్ సీఎం బీసీ వ్యక్తే: MLC తీన్మార్ మల్లన్న

హైదరాబాద్: తెలంగాణకు చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని, వచ్చే సారి రాష్ట్రానికి బీసీ వ్యక్తే సీఎం అవుతారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2028 ఎన్నికల్లో బీసీ బిడ్డనే తెలంగాణ ముఖ్యంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి కేబినెట్‎లో మిగిలిన ఆరు మంత్రి పదవులు కూడా బీసీలకేనని పేర్కొన్నారు. గతంలో లాగా ఇప్పుడు బీసీలు లేరని.. మాలో చైతన్యం వచ్చిందన్నారు. కులాలు వేరు అయినా మేమంతా బీసీలమేనని మోటిషవేనల్ కామెంట్స్ చేశారు. 

నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‎లోని ఓ హోటల్‎లో బీసీ డిమాండ్స్‎పై అల్ పార్టీ క్యాస్ట్ అసోసియేషన్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాజకీయాలు, ఉద్యోగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని.. లెక్క ప్రకారం దక్కాల్సిన ఫలాలు బీసీలకు అందడం లేదన్నారు.

ALSO READ | కేటీఆర్ కి మీడియా ఫోబియా.. ఓవైసీలకు ఉగ్రవాదులతో లింక్: బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‎తో పాటు బీసీ డిక్లరేషన్‎లోని హామీలు అమలు బాధ్యత నేను తీసుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ అగ్ర కులాల వ్యక్తులకే దక్కుతున్నాయని.. బీసీలలో కాంట్రాక్టర్లే లేరా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో బీసీలపై 3 లక్షల ముప్పై ఏడు కోట్ల రూపాయల అప్పు ఉందని.. అసలు ఈ అప్పు ఎందుకు చేశారో కూడా తెలియదన్నారు. గత పాలకుల కారణంగానే ఈ అప్పు అయ్యిందంటున్నారు.. అసలు దీనికి బాధ్యులు ఎవరని క్వశ్చన్ చేశారు.