ఆ మధ్య కన్నడ ప్రముఖ హీరో యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రంలో ప్రధానమంత్రి పాత్రలో నటించి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రవీనా టాండన్ ఆకట్టుకుంది. దీంతో రవీనా కి ప్రస్తుతం సౌత్ లో కూడా సినీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే తాజాగా నటి రవీనా టాండన్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకి క్షమాపణలు చెప్పింది.
పూర్తీ వివరాలలోకి వెళితే కొన్ని రోజుల క్రితం నటి రవీనా లండన్ కి వెళ్ళింది. దీంతో పని నిమిత్తమై బయటికి వెళ్ళినపుడు కొందరు అభిమానులు సెల్ఫీ ఇవ్వాలని ఆమె చుట్టుముట్టారు. దీంతో రవీనా తన పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు సహాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయం గురించి తాజాగా రవీనా ట్వీట్ చేసింది.
ALSO READ | శోభితా ధూళిపాళ్ల లవ్ సితార ట్రైలర్ రిలీజ్
ఇందులో భాగంగా తనకి గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా భయపడి తన అభిమానులకు సెల్ఫీ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయానని పేర్కొంది. అంతేగాకుండా ఈ సంఘటన తర్వాత తాను కూడా చాలా బాధపడ్డానని అలాగే ఈ ట్వీట్ వారు చదువుతున్నట్లయితే తనని క్షమించాలని కోరింది. త్వరలోనే మనం మళ్ళీ కలుద్దామని అప్పుడు కచ్చితంగా సెల్ఫీ ఇస్తానని ట్వీట్ ద్వారా తన అభిమానులకి తెలియజేసింది.
Hi , this is just to put on record . That a few days ago in london , I was walking by and a few men approached me , I anyway have heard not such great things about the crime situation here, so I withdrew a bit when they asked if I was who I am, and my first instinct was to say no…
— Raveena Tandon (@TandonRaveena) September 13, 2024