ఖైరతాబాద్​ బడా గణపతి దర్శనంలో .. ఇబ్బంది పడుతున్న మహిళలు, వృద్దులు

ఖైరతాబాద్​ బడా గణపతి దర్శనంలో .. ఇబ్బంది పడుతున్న మహిళలు, వృద్దులు

ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. గంట గంటకు పెరుగుతున్న భక్తుల రద్దీ పెరుగుతోంది.  ఈ రోజు ( సెప్టెంబర్​ 15)  ఆదివారం.. స్వామివారి దర్శనానికి చివరి రోజు కావడంతో  భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రద్దీని అదుపుచేయలేక  పోలీసులు, ఉత్సవ కమిటీ  చాలా ఇబ్బందులు పడుతున్నారు.  విపరీతమైన రద్దీ కారణంగా  మహిళలు..పిల్లలు.. వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు. 

ALSO READ| గణేష్ నిమజ్జనం రోజు మెట్రో సర్వీస్ టైం పొడిగింపు

 ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతి ఇస్తారు. మంగళవారం ( సెప్టెంబర్​ 17) నిమజ్జనం అయినప్పటికి .. రేపు ( సెప్టెంబర్​ 16) నిమజ్జన ఏర్పాట్లు చేస్తారు.  భారీ గణపతి నిమజ్జనం కోసం విజయవాడ నుండి తీసుకవచ్చిన టస్కర్ కొనసాగుతున్న వెల్డింగ్ పనులుకొనసాగుతున్నాయి. బడా గణేష్​ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్​ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్​ జాం ఏర్పడింది. 17వ తేదీ శోభాయాత్ర అనంతరం.. హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జనం జరగనుంది.