
ఒట్టావా: ఖలిస్తానీ టెర్రరిస్టు, నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ తాత్కాలిక చీఫ్అర్ష్ దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాకు కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30 వేల అమెరికన్ డాలర్ల (రూ.25 లక్షలు) పూచీకత్తుపై అతడికి బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది. ఈ ఏడాది అక్టోబరులో కెనడాలోని హాల్టన్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో దల్లా గాయపడ్డాడు. తర్వాత అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి దల్లాను తమకు అప్పగించాలని కెనడాను భారత ప్రభుత్వం కోరుతోంది. ఇలాంటి సమయంలో దల్లాకు కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.