
- అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్
ఖమ్మం రూరల్, వెలుగు: నెలాఖరులోగా సీఎంఆర్ టార్గెట్ కంప్లీట్ చేయాలని ఖమ్మం అడిషనల్కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ ఆదేశించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, నేలకొండపల్లి మండలం రాయగూడెం, ముదిగొండ మండలం అమ్మపేట, కొణిజర్లలోని రైస్మిల్లులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మిల్లులకు కేటాయించిన, ఇప్పటివరకు ప్రభుత్వానికి అందించిన సీఎంఆర్లెక్కలపై ఆరా తీశారు.
పెండింగ్ బియ్యాన్ని త్వరగా అప్పగించాలని మిల్లర్లకు సూచించారు. ఈ నెల 31తో గడువు ముగుస్తుందని, ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. టార్గెట్పూర్తిచేయని మిల్లులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.