శ్రద్ధగా చదివి గొప్ప స్థాయికి ఎదగాలి

శ్రద్ధగా చదివి గొప్ప స్థాయికి ఎదగాలి
  • ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు :  శ్రద్ధగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి, మరో నలుగురి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు అందించేందుకు మలబార్​ గోల్డ్​చారిటబుల్​ సంస్థ గురువారం స్థానిక శాంతినగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  47 మందికి ప్రోత్సాహకంగా రూ.3.80 లక్షల చెక్కును అందజేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న విద్యను వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. విద్యార్థులకు సాయం చేస్తున్న మలబార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పవన్, భరత్ కుమార్, రాణి, శ్రీనివాస్, కిరణ్, మలబార్ సంస్థ జిల్లా హెడ్ విష్ణు, మేనేజర్ రామారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.