వియం బంజర్​ పోలీసులకు సీపీ అభినందన

వియం బంజర్​ పోలీసులకు సీపీ అభినందన

పెనుబల్లి, వెలుగు :  రాష్ట్ర స్థాయి పోలీస్​ క్రీడల్లో​మెడల్స్​ సాధించిన పోలీసులను ఖమ్మం సీపీ సునీల్​దత్ బుధవారం అభినందించారు.  ఇటీవల జరిగిన మూడవ రాష్ట్ర స్థాయి పోలీస్​ క్రీడల్లో విఎం బంజరు పీఎస్​లో కానిస్టేబుల్స్​​గా పని చేస్తున్న  ఎస్​కే మజీద్ ​పాషా షాట్​ ఫుట్​లో గోల్డ్​ మెడల్​ సాధించగా, బి వెంకటేశ్వరరావు హ్యాండ్​ బాల్​ విభాగంలో సిల్వర్​ మెడల్​ సాధించారు. దీంతో సీపీ కార్యాలయంలో వారిని అభినంధించారు. మెడల్​ సాధించిన సిబ్బందికి సత్తుపల్లి రూరల్​ సీఐ ముత్తులింగయ్య, ఎస్సై వెంకటేశ్​ శుభాకాంక్షలు తెలిపారు.