
ఇండియా, కిర్గిజ్స్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్ సైజ్ ఖంజర్ 12వ ఎడిషన్ 2025, మార్చి 10 నుంచి 23 వరకు కిర్గిజ్స్తాన్లో జరగనున్నది. 20 మంది సిబ్బందితో కూడిన ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ నుంచి పారాచూట్ రెజిమెంట్ స్పెషల్ ఫోర్సెస్, 20 మంది సిబ్బందితో కూడిన కిర్గిజ్స్తాన్నుంచి స్కార్పియన్ బ్రిగేడ్ స్పెషల్ ఫోర్సెస్ ఈ విన్యాసాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఇండియా, కిర్గిజ్స్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్ సైజ్ ఖంజర్ విన్యాసాలను ప్రతి ఏటా ఇరు దేశాలు ప్రత్యామ్నాయంగా (ఒక ఏడాది భారత్, మరో ఏడాది కిర్గిజ్స్తాన్) 2011 నుంచి నిర్వహిస్తున్నాయి. 12వ ఎడిషన్ విన్యాసాలు 2024లో హిమాచల్ప్రదేశ్లోని బక్లో ప్రాంతంలో స్పెషల్ ట్రైనింగ్ స్కూల్లో జరిగాయి.
విన్యాసాల లక్ష్యం
ప్రత్యేక దళాల శిక్షణ, కొండ ప్రాంతాల్లో సైనిక చర్యలకు కావాల్సిన నైపుణ్యత, అధునాతన సాంకేతికత, రక్షణరంగ నైపుణ్యత తదితర ద్వైపాక్షిక సహకారాలను ఈ విన్యాసం ద్వారా బలోపేతం చేస్తారు.
ఈ విన్యాసాలు ఇరుపక్షాల మధ్య రక్షణ సంబంధాలను పటిష్టపరచుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది.
ఖంజర్ అంటే ఒక బాకు లాంటి ఆయుధం.