BiggBoss: సంచలన నిర్ణయం: ఇదే నా చివరి సీజన్.. హోస్ట్గా బిగ్బాస్ చేయనంటూ స్టార్ హీరో ట్వీట్

BiggBoss: సంచలన నిర్ణయం: ఇదే నా చివరి సీజన్.. హోస్ట్గా బిగ్బాస్ చేయనంటూ స్టార్ హీరో ట్వీట్

కింగ్ ఆఫ్ రియాలిటీ షోస్ అనిపించుకున్న బిగ్‌‌‌‌బాస్ ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు నాగ్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంటే..మరోవైపు సల్మాన్ హోస్ట్ చేస్తోన్న హిందీ బిగ్ బాస్ సీజన్ 18, అలాగే విజయ్ సేతుపతి కొత్త హోస్ట్ గా తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8 రీసెంట్ గా మొదలై ఆకట్టుకుంటోన్నాయి.

ఈ నేపథ్యంలో కన్నడ బిగ్ బాస్ షో(BBK11)కి హోస్ట్గా చేస్తోన్న హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep).. ఇక తాను ఈ షో చేయబోనని తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. వివరాల్లోకి వెళితే.. 

కన్నడలో హీరో కిచ్చా సుదీప్ దశాబ్ది కాలంగా ఆడియన్స్ లో ఉత్సాహం నింపుతూ వస్తోన్నాడు. తెలుగులో నాగ్ ఎలాగైతే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడో అక్కడి వారికి సుదీప్ తనదైన ఆటతో 11 సీజన్లు సక్సెస్ ఫుల్ గా హోస్ట్ గా గుర్తింపు పొందాడు. అయితే, ఈ క్రమంలో ఆదివారం (అక్టోబర్ 13) న సోషల్ మీడియాలో ప్రకటించి బిగ్ బాస్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు. 

"బిగ్ బాస్ కన్నడ 11కు మీరు ఇస్తున్న గొప్ప స్పందనకు అందరికీ ధన్యవాదాలు.. ఈ షోపై, నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు టీవీఆర్ (టెలివిజన్ రేటింగ్) నిదర్శనం. మీతో పదేళ్ల పాటు కలిసి చేసిన ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఇక ఇప్పుడు నేను జీవితంలో నా తర్వాతి దశపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది.

బిగ్ బాస్ కన్నడ 11 (BBK11)కి హోస్ట్‌గా ఇది నా చివరి సీజన్. చాలా ఏళ్లుగా బిగ్ బాస్ ఫాలో అవుతున్న వాళ్లు, కలర్స్ వాళ్లు నా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని నేను నిజంగా నమ్ముతున్నాను. ప్రస్తుత ఈ 11వ సీజన్ ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుదాం. నేను కూడా మీకు సాధ్యమైనంత మేరకు వినోదంతో అలరిస్తాను. ఇందుకు మీ అందరికీ ధన్యవాదాలు" అంటూ కిచ్చా సుదీప్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

కాగా బిగ్ బాస్ కన్నడ తొలి సీజన్ 2013లో ప్రారంభమైంది. అప్పటి నుంచీ కిచ్చా సుదీపే ఈ షో హోస్ట్ గా ఉంటూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం కిచ్చా చేసిన ట్వీట్తో సుదీప్ లేని బిగ్ బాస్ కన్నడను ఊహించుకోవడం కష్టం అంటున్నారు అతని అభిమానులు. కిచ్చా ప్రస్తుతం వరుస మూవీస్ లో బిజీగా ఉండడం వల్ల ఈ షోకి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు అనూప్ భండారి (Anup Bhandari) డైరెక్షన్లో ‘విక్రాంత్ రోనా’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత..సుదీప్ ఆయనతో కలిసి బిల్లా రంగా బాషా అనే పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాని హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై (Primeshow Entertainment) కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించనున్నారు.

ఈ మధ్యే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియోలో క్రీ.శ. 2209లో జరిగిన భవిష్యత్తు గురించిన ఒక సంగ్రహావలోకనం, ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్ మరియు తాజ్ మహల్ అన్నీ ధ్వంసమయ్యాయి. అలాగే ఒక వ్యక్తి అన్నింటినీ జయించినట్లు కనిపిస్తోంది. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు మరియు జాతులు, వాతావరణాన్ని చూపించాడు దర్శకుడు. ఇదే కాకుండా ప్రస్తుతం మ్యాక్స్ అనే మరో మూవీలోనూ కిచ్చా సుదీప్ నటిస్తున్నాడు.