వీడిన నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ మిస్టరీ

వీడిన నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ మిస్టరీ

నిజామాబాద్​,  వెలుగు:  ఇందూరు సిటీలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఆవరణలో కిడ్నాప్​కు గురైన బాబు కథ సుఖాంతమైంది. ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్​ కు చెందిన అంజుమ్​ బేగం తన పదేండ్ల కూతురుతో పాటు దుర్గాప్రభురావుబా మోహితే అనే మహిళతో కలిసి భిక్షాటన చేయించడానికి చిన్నపిల్లలను కిడ్నాప్​చేయాలనే ప్లాన్​తో సిటీకి వచ్చారు. 

శుక్రవారం రాత్రి జీజీహెచ్​లోని పిల్లల వార్డులోకి వెళ్లారు. అనంతరం బయటకు వచ్చి పార్కింగ్​స్థలంలో తల్లి లక్ష్మి పక్కన నిద్రిస్తున్న ఏడాది బాబు మణికంఠను ఎత్తుకెళ్లారు. నాందేడ్​వెళ్లేందుకు రైల్వే స్టేషన్​వెళ్లగా రైలు లేదు. కిడ్నాప్​ఘటన బయటకు తెలియడంతో పోలీసులకు దొరుకుతామనే భయంతో శనివారం రోజంతా ఆటో రిక్షాలో సిటీలో అటు ఇటూ తిరిగారు. ఆదివారం పాత బస్టాండ్​నుంచి బస్సులో నాందేడ్​వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.  ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్టు సీఐ సీఐ రఘుపతి తెలిపారు.