
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్లోని కిమ్స్ కాలేజీ బీఎస్సీ, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ స్టూడెంట్లు క్షేత్రపర్యటనలో భాగంగా బుధవారం హైదరాబాద్లోని హిందూస్తాన్ కోకా కోలా బెవరేజెస్ కంపెనీని సందర్శించినట్లు వైస్ చైర్మన్ సాకేత్ రామారావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ సైన్స్ స్టూడెంట్లు కూల్డ్రింక్స్ తయారీ, ముడిసరుకులు, క్వాలిటీ కంట్రోల్. తదితరాలపై అవగాహక కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అర్జున్ బాబు, హెచ్వోడీ మహేశ్, లెక్చరర్లు పాల్గొన్నారు.