Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడిక్ థ్రిల్లర్.. బడ్జెట్ తెలిస్తే షాకే!

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడిక్ థ్రిల్లర్.. బడ్జెట్ తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన నుండి చివరగా వచ్చిన సినిమా రూల్స్ రంజన్. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు కిరణ్. ఆ సమయాన్ని తన తరువాతి సినిమాను పక్కాగా ప్లాన్ చేసుకోవడనికి ఉపయోగించుకున్నాడు. అదేంటంటే.. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడట. 

శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట. నిజానికి కిరణ్ అబ్బవరం లాంటి హీరోపై రూ.20 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఒకరకంగా నిర్మాతలు రిస్క్ చేస్తున్నట్టే. కానీ, వారు ఎంచుకున్న కథపై నమ్మకంతోనే కిరణ్ పై అంత పెట్టడానికి సిద్దమయ్యారట.

ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట. త్వరలోనే మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకొని అక్టోబర్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇక ఈ న్యూస్ తెలిసి కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్యాప్ ఇచ్చినా పరవాలేదు.. పాన్ ఇండియా సినిమాతో వస్తున్నారు కిరణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కిరణ్ అబ్బవరం చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.