
భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి, వెలుగు : బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి అన్నారు. లక్ష్మీదేవిపల్లిలో, ములకలపల్లిలో ఆదివారం వేర్వేరుగా నిర్వహించిన అసెంబ్లీ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. లక్ష్మీదేవిపల్లిలో జిల్లా కో ఆర్డినేటర్నాళ్ల సోమసుందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీ. రంగాకిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి రంగరాజు రుక్మరావు, ములకపల్లిలో కన్వీనర్ గొట్టిపాళ్ల దుర్గా శ్రీను, జిల్లా ఇన్చార్జి ఉప్మా రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోమ సుందర్ రావు, రాంబాబు, రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యులు జూదూరి చెన్నారావు, దమ్మపేట యువజన అధ్యక్షుడు పల్లపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.