-
జమ్ము కాశ్మీర్ లో నిన్న రాహుల్ గాంధీ కామెంట్స్
-
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
-
ఆత్మస్థైర్యం పెరిగితేనే మూడోసారి అధికారమిచ్చారని విమర్శ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మస్థైర్యం తగ్గిందా? పెరిగిందా? అనే దానికి గత 100 రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. జమ్ముకాశ్మీర్ లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ నిన్న చేసిన కామెంట్స్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి ఆత్మవిశ్వాసం తగ్గిందని, తమ కారణంగానే అది జరిగిందనడం హస్యాస్పదంగా ఉందన్నారు.
ALSO READ | రద్దు చేసిన వ్యవసాయ చట్టాలు మళ్ళీ తీసుకురావాలి: కంగనా రనౌత్
ప్రధానిపై 140 కోట్ల మంది ప్రజలకు విశ్వాసం ఉందని.. అందుకే మూడోసారి అధికారమిచ్చారని అన్నారు. మోదీపై భారత్ లోనే కాదు.. ప్రపంచం మొత్తం విశ్వాసం ఉందని చెప్పారు. అలాంటి నాయకుడిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎవరూ నమ్మరని వెల్లడించారు. జమ్ముకాశ్మీర్ లో గెలుపుపై నమ్మకం లేకనే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, దేశ వ్యతిరేక శక్తులకు వంతపాడుతున్నారని తెలిపారు. విదేశాల్లో భారత్ ను కించపరిచేలా మాట్లాడుతున్న రాహుల్ ను సొంత పార్టీ నేతలే నమ్మడం లేదని విమర్శించారు.