డీఎస్ అందరితో స్నేహంగా ఉండేవారు : కిషన్ రెడ్డి

డీఎస్ అందరితో స్నేహంగా ఉండేవారు : కిషన్ రెడ్డి

డీఎస్ మృతి బాధ కల్గించిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. డీఎస్ మృతదేహానికి నివాళి అర్పించిన కిషన్ రెడ్డి.. ఆయన  కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.   డీఎస్ అందరితో స్నేహంగా ఉండేవారన్నారు. తెలంగాణ కోసం ఎంతో కృషిచేశారని చెప్పారు.  రాజకీయాల్లో యువతను ప్రోత్సహించేవారని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డి. శ్రీనివాస్ అనేక బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. 

శాసన సభ్యులుగా ఉన్న సమయంలో  ఆయనతో కలిసి పని చేసే అవకాశం కలిగిందన్నారు. 2004 కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ లోకి వచ్చాక అందరం కలిసి పనిచేయాలని చెప్పేవారన్నారు.