కేకే రిజైన్​పై జీవన్​రెడ్డి హర్షం

కేకే రిజైన్​పై జీవన్​రెడ్డి హర్షం

 

  • నైతిక విలువలకు కట్టుబడి ఉండాలె


హైదరాబాద్​: నైతిక విలువకు కట్టిబడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన కే. కేశవరావు నిర్ణయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం  చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఆర్​ఎస్​ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన కేశవ రావు కాంగ్రెస్​ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినపుడు నైతిక విలువకు కట్టుబడి  పదవులకు రిజైన్​ చేయాలన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామ చేయడంపై ఆయన హర్షం ప్రకటించారు.