![కేకే రిజైన్పై జీవన్రెడ్డి హర్షం](https://static.v6velugu.com/uploads/2024/07/kk-resigned-rajayasabha-mp-after-mlc-jeevenreddy-statement-here_HFTOtSh1vx.jpg)
-
నైతిక విలువలకు కట్టుబడి ఉండాలె
హైదరాబాద్: నైతిక విలువకు కట్టిబడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన కే. కేశవరావు నిర్ణయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన కేశవ రావు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినపుడు నైతిక విలువకు కట్టుబడి పదవులకు రిజైన్ చేయాలన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామ చేయడంపై ఆయన హర్షం ప్రకటించారు.