కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

కాంగ్రెస్ పార్టీలో చేరారు కె.కేశవరావు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షులు ఖర్గే.. సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి స్వాగతించారాయన. కె.కేశవరావు పార్టీలో చేరిన సందర్భంలో.. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. 

పార్టీలో చేరిక ముందు.. కె.కేశవరావుకు స్వయంగా ఫోన్ చేశారు ప్రియాంక గాంధీ. పార్టీలో జాయిన్ కావటంపై ఆనందం వ్యక్తం చేశారామె. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కె.కేశవరావు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ ఇప్పుడు సొంతింటికి వచ్చారు కేశవరావు. 

కేశవరావు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావటంపై కేంద్ర అధిష్టానం కూడా హ్యాపీగా ఉంది. ప్రియాంక గాంధీ సాదర స్వాగతం పలికారు.