బీఆర్ఎస్కు గ్రూప్- 1 పై మాట్లాడే నైతిక హక్కు లేదు: కోదండరాం

బీఆర్ఎస్కు  గ్రూప్- 1 పై మాట్లాడే నైతిక హక్కు లేదు: కోదండరాం

గ్రూప్- 1 ఎగ్జామ్స్ పై బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం.  గత ప్రభుత్వ విధానాల వల్లే  నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయిందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు.. ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్ని సార్లు  వివరాలు అడిగినా గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందన్నారు కోదండరాం. 

జీవో 55, 29 ల అమలు వెనుక కోర్టు సూచనలున్నాయన్న సంగతి తెలుసుకోవాలన్నారు కోదండరాం. తమ పార్టీ అప్పుడు..  ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై పోరాడుతూనే ఉందన్నారు.  తమ ఆందోళనలు, సూచనలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఉద్యోగాల భర్తీ మీద బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు.  నిరుద్యోగులను బీఆర్ఎస్  తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది... దీన్ని సహించేది లేదన్నారు కోదండరాం.

గ్రూప్ 1 ఎగ్జామ్ ను వాయిదా వేయాలని..జీవో 29న రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే..