సురక్షిత నగరం కోల్​కతా..రెండో స్థానంలో పుణె, హైదరాబాద్​

సురక్షిత నగరం కోల్​కతా..రెండో స్థానంలో పుణె, హైదరాబాద్​

దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్​ రాజధాని కోల్​కతా వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. 2023, డిసెంబర్ 5న విడుదల చేసి ఎన్​సీఆర్​బీ నివేదిక ప్రకారం 2022లో ప్రతి లక్ష మంది జనాభా కనిష్ట సంఖ్యలో గుర్తించదగిన నేరాలు నమోదైన నగరాలలో 86.5 కేసులతో కోల్​కతా ప్రథమ స్థానం సాధించింది. తర్వాత స్థానాల్లో పుణె, హైదరాబాద్​ నగరాలు ఉన్నాయి.

2021లో గుర్తించదగిన నేరాల సంఖ్య ప్రతి లక్ష జనాభాకు కోల్​కతాలో 103.4, పుణెలో 256.8, హైదరాబాద్​లో 259.9గా నమోదైంది. 20 లక్షలకుపైగా జనాభా ఉన్న 19 మెట్రోపాలిటన్​ నగరాల్లోని సమాచారంతో ఎన్​సీఆర్​బీఈ ర్యాంకులను ప్రకటించింది. మొత్తం మూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీల వివరాలతో క్రైం ఇన్​ ఇండియా 2022 పేరిట ఎన్​సీఆర్​బీ ఈ నివేదికను విడుదల చేసింది.