పర్యాటక హబ్గా కొల్లాపూర్.. గ్లాస్​బ్రిడ్జితో నల్లమలలో చిగురిస్తున్న ఆశలు

పర్యాటక హబ్గా కొల్లాపూర్..   గ్లాస్​బ్రిడ్జితో నల్లమలలో చిగురిస్తున్న ఆశలు

కృష్ణా నది మీదుగా తెలంగాణ-ఆంధ్రను కలుపుతూ నేషనల్ హైవే-167 కే నిర్మాణానికి లైన్ క్లియర్ కావడంతో నల్లమల రూపురేఖలు మారనున్నాయి. కొల్లాపూర్ ప్రాంతం పర్యాటక హబ్ గా మారనుంది. నాగర్​కర్నూల్​జిల్లా కొట్ర నుంచి ఏపీలోని నంద్యాల వరకు 167 – కే  హై వే పనులు స్పీడ్ గా నడుస్తున్నాయి. బ్రిడ్జి నిర్మాణానికి కూడా టెండర్లను నేషనల్​హైవే​సంస్థ పిలవడంతో నల్లమల ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి. 

 రూ.1,082.56 కోట్లతో నిర్మించే​బ్రిడ్జి తెలంగాణలోని సోమశిల(మల్లేశ్వరం) నుంచి ఏపీలోని సంగమేశ్వరం వరకు నదిలో కేవలం రెండు పిల్లర్లపై దాదాపు1.77 కిలో మీటర్లు నిర్మాణం కానుంది. డబుల్​స్టోర్డ్​బ్రిడ్జిలోపై నుంచి వాహనాలు వెళ్తాయి. 

సెకండ్ ​ఫ్లోర్​లో గ్లాస్ ​రోడ్డు ఉంటుంది. కృష్ణా నది అందాలు చూసేందుకు గ్లాస్ ​బ్రిడ్జిపై నుంచి నడిచివెళ్లే చాన్స్ కల్పిస్తారు. బ్రిడ్జి నుంచి  పడవలు, బోట్లు, లాంచీలు వెళ్లేందుకు రెండు పిల్లర్ల మధ్య 482 మీటర్ల దూరం ఉండేలా నిర్మించనున్నారు.

 నేషనల్ హై వే–167కే నిర్మాణంతో పాటు ఐకానిక్​బ్రిడ్జి పనులు పూర్తయితే కొల్లాపూర్​పర్యాటక హబ్ గా మారనుంది. ఈ ప్రాంతమంతా నల్లమల అడవితో పాటు కృష్ణా నది బ్యాక్​ వాటర్​తో రెండు నదులు కలిసి ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. కొల్లాపూర్​సంస్థానం, రాజవారి కోట, మాధవస్వామి ఆలయం, సోమశిల, అమరగిరి, మల్లేశ్వరం, మంచాలకట్ట,  జటప్రోల్ ​ప్రాంతాలు ఆధ్మాత్మిక, ఎకో టూరిజం, వాటర్​ స్పోర్ట్స్, సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణంతో పర్యాటక ప్రాంతంగా మారుతాయి. 

మరోవైపు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను తెలంగాణ టూరిజం, ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​తో పాటు నేషనల్​హైవే సంస్థ కూడా ప్రచారం చేసుకుంటాయి. ఇక సప్త నదుల సంగమ క్షేత్రంలో ఏడాదిలో 9 నెలల పాటు కృష్ణా నదిలో మునిగి ఉండే సంగమేశ్వర ఆలయం, అంకాలమ్మ కోట వంటివి కూడా అభివృద్ధి చెందే చాన్స్ ఉంది.