కృష్ణా నది మీదుగా తెలంగాణ-ఆంధ్రను కలుపుతూ నేషనల్ హైవే-167 కే నిర్మాణానికి లైన్ క్లియర్ కావడంతో నల్లమల రూపురేఖలు మారనున్నాయి. కొల్లాపూర్ ప్రాంతం పర్యాటక హబ్ గా మారనుంది. నాగర్కర్నూల్జిల్లా కొట్ర నుంచి ఏపీలోని నంద్యాల వరకు 167 – కే హై వే పనులు స్పీడ్ గా నడుస్తున్నాయి. బ్రిడ్జి నిర్మాణానికి కూడా టెండర్లను నేషనల్హైవేసంస్థ పిలవడంతో నల్లమల ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి.
రూ.1,082.56 కోట్లతో నిర్మించేబ్రిడ్జి తెలంగాణలోని సోమశిల(మల్లేశ్వరం) నుంచి ఏపీలోని సంగమేశ్వరం వరకు నదిలో కేవలం రెండు పిల్లర్లపై దాదాపు1.77 కిలో మీటర్లు నిర్మాణం కానుంది. డబుల్స్టోర్డ్బ్రిడ్జిలోపై నుంచి వాహనాలు వెళ్తాయి.
సెకండ్ ఫ్లోర్లో గ్లాస్ రోడ్డు ఉంటుంది. కృష్ణా నది అందాలు చూసేందుకు గ్లాస్ బ్రిడ్జిపై నుంచి నడిచివెళ్లే చాన్స్ కల్పిస్తారు. బ్రిడ్జి నుంచి పడవలు, బోట్లు, లాంచీలు వెళ్లేందుకు రెండు పిల్లర్ల మధ్య 482 మీటర్ల దూరం ఉండేలా నిర్మించనున్నారు.
నేషనల్ హై వే–167కే నిర్మాణంతో పాటు ఐకానిక్బ్రిడ్జి పనులు పూర్తయితే కొల్లాపూర్పర్యాటక హబ్ గా మారనుంది. ఈ ప్రాంతమంతా నల్లమల అడవితో పాటు కృష్ణా నది బ్యాక్ వాటర్తో రెండు నదులు కలిసి ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. కొల్లాపూర్సంస్థానం, రాజవారి కోట, మాధవస్వామి ఆలయం, సోమశిల, అమరగిరి, మల్లేశ్వరం, మంచాలకట్ట, జటప్రోల్ ప్రాంతాలు ఆధ్మాత్మిక, ఎకో టూరిజం, వాటర్ స్పోర్ట్స్, సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణంతో పర్యాటక ప్రాంతంగా మారుతాయి.
మరోవైపు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను తెలంగాణ టూరిజం, ఫారెస్ట్డిపార్ట్మెంట్తో పాటు నేషనల్హైవే సంస్థ కూడా ప్రచారం చేసుకుంటాయి. ఇక సప్త నదుల సంగమ క్షేత్రంలో ఏడాదిలో 9 నెలల పాటు కృష్ణా నదిలో మునిగి ఉండే సంగమేశ్వర ఆలయం, అంకాలమ్మ కోట వంటివి కూడా అభివృద్ధి చెందే చాన్స్ ఉంది.