Karthi 29: పీరియాడిక్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో కార్తి కొత్త చిత్రం షురూ..డైరెక్టర్‌ ఎవరంటే?

Karthi 29: పీరియాడిక్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో కార్తి కొత్త చిత్రం షురూ..డైరెక్టర్‌ ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ కార్తికి టాలీవుడ్‌‌‌‌లోనూ స్టార్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్న ఆయన.. ఆదివారం మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌ అనౌన్స్ చేశాడు. కార్తి హీరోగా ‘తానక్కరన్’ ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఎస్‌‌‌‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా , రాజా సుబ్రమణియన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.

కార్తి నటిస్తున్న 29వ సినిమా ఇది. భారీ పీరియాడిక్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్, ఇతర నటీనటులతో పాటు టెక్నీషియన్స్ వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పిన దర్శక నిర్మాతలు వచ్చే ఏడాది సినిమా రిలీజ్‌‌‌‌ చేయనున్నట్టు తెలియజేశారు. డైరెక్టర్ తమిళ్..సూర్య నటించిన జై భీమ్ మూవీలో SI గురుమూర్తి పాత్రలో విలన్ గా నటించారు. 

ధీరన్ అధిగారం ఒండ్రు, అరువి, ఖైదీ, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రాబోతోంది.