సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డిని  కలిసిన కొమ్మూరి  ప్రతాప్​ రెడ్డి

జనగామ, వెలుగు : జనగామ డీసీసీ ప్రెసిడెంట్​, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి సీఎం రేవంత్​ రెడ్డిని గురువారం హైదరాబాద్​లో మర్యాద పూర్వకంగా కలిశారు.

జనగామ నియోజకవర్గంలో డెవలప్ మెంట్​ పనుల కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ 10 కోట్లు, జనగామ మున్సిపాలిటీకి రూ 25 కోట్లు,  చేర్యాల మున్సిపాలిటీకి రూ 10 కోట్ల నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.