కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు

కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. ఆదివారం ఆదాయ, వ్యయ వివరాలను ప్రకటించారు. ఈ ఏడాదిలో టికెట్లు, సేవాల ద్వారా రూ. 8. 39 కోట్లు,  ప్రసాదాల విక్రయాలు రూ. 6. 31 కోట్లు,  హుండీ లెక్కింపులు రూ. 7.59 కోట్లు, పెట్టుబడులు రూ.12.51కోట్లు, వడ్డీలు రూ.92.25 లక్షలు, లీజ్ అండ్ లైసెన్సులు రూ.2.88 కోట్లు, అన్నదానం రూ.25.72 లక్షలు, ఇతర ఆదాయం రూ.81. 78 లక్షలు, అడ్జెస్ట్​మెంట్స్ రూ. 63.30 లక్షలు, ప్రారంభ నిల్వ రూ.55. 60 లక్షలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5. 03 కోట్లతో కలసి మొత్తం రూ. 45. 81 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.

వ్యయాల కింద ఉత్సవాల నిర్వహణకు రూ.95. 78 లక్షలు, ప్రసాదాల తయారికీ రూ.4.08 కోట్లు, ఎస్టాబ్లిష్​మెంట్​ చార్జీలు రూ. 5.72 కోట్లు,  స్ట్యాటుటరీ చెల్లింపులు రూ.3.18 కోట్లు, అడ్జెస్ట్​మెంట్ రూ.12.77 కోట్లు, ఇతరాలు రూ.74. 72 లక్షలు, అన్నదానం రూ.36.10లక్షలు, జాతర నిర్వహణకు రూ.94.89లక్షలు, వేతనాలు రూ.1.61 కోట్లు, నిర్మాణాలు రూ.5. 69 కోట్లు, శానిటేషన్ కు​ రూ.1.03 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ముగింపు నిల్వగా రూ. 15.10 లక్షలు బ్యాంకు నిల్వ రూ.7. 02 కోట్లు ఉన్నట్లు చెప్పారు. గతేడాది నికర ఆదాయం రూ18.74 కోట్లు రాగా ఈ సంవత్సరం రూ.20. 98 కోట్లు  వచ్చినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే 2. 23 కోట్లు  అధికంగా వచ్చిందని అధికారులు వెల్లడించారు.