మల్లన్న ఎనిమిదో ఆదివారం ఆదాయం రూ.55,18, 026

మల్లన్న ఎనిమిదో ఆదివారం ఆదాయం రూ.55,18, 026

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఎనిమిదవ ఆదివారం ఆదాయం రూ.55,18, 026 వచ్చినట్లు సోమవారం ఆలయ అధికారులు తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం రూ.16,54,043, శనివారం రూ.16,11,232, ఆదివారం రూ.22,52,751 వచ్చిందన్నారు.

వీటితో పాటు సోమవారం మరో రూ.5 లక్షల వరకు బుకింగ్​ఆదాయం వస్తుందని ఆధికారులు భావిస్తున్నారు.