250 రూపాయలతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్లాన్.. కోటక్​ మహీంద్రా నుంచి చోటీ సిప్

250 రూపాయలతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్లాన్.. కోటక్​ మహీంద్రా నుంచి చోటీ సిప్

న్యూఢిల్లీ: కోటక్​ మహీంద్రా అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (కోటక్​ మ్యూచువల్ ఫండ్)  'చోటీ ఎస్‌‌‌‌ఐపీ' పేరుతో తన కొత్త పథకం ప్రారంభించింది. దీని ద్వారా కొత్త పెట్టుబడిదారులు కేవలం 250 రూపాయలతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్​) మొదలుపెట్టవచ్చు. ఈ పథకం కొత్త పెట్టుబడిదారుల కోసం మాత్రమేనని కోటక్​ పేర్కొంది.- పెట్టుబడిదారులు 'గ్రోత్ ఆప్షన్'లో పెట్టుబడి పెట్టాలని,  కనీసం 60 నెలవారీ వాయిదాలకు కట్టుబడి ఉండాలని వివరించింది.