
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ అధికంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపిస్తూ చిరు వ్యాపారులు కొత్తగూడెం మార్కెట్లో సోమవారం ఆందోళన చేశారు. కాంట్రాక్టర్కు వ్యాపారులకు మధ్య వాగ్వావాదం జరిగింది. కాట్రాక్టర్ తీరును నిరసిస్తూ కొంత సేపు మార్కెట్ను బంద్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గొడవను సద్దుమణిగేలా చూశారు. ఈ సందర్భంగా మార్కెట్కమిటీ సెక్రటరీ అంజద్తో చిరు వ్యాపారులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అడిగినంత ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.
తై బజార్ కాంట్రాక్టర్ 15 చదరపు గజాలలోపు రూ.10 వసూలు చేయాల్సి ఉండగా రూ.30కిపైగా వసూలు చేస్తున్నారని, మిగతావాటి పరిస్థితి ఇదే విధంగా ఉందని తెలిపారు. కాంట్రాక్టర్బలవంతపు వసూళ్లు ఆపకపోతే మార్కెట్ను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. తై బజార్వేలం టైంలో వసూళ్లకు సంబంధించిన వివరాలను మార్కెట్తో పాటు ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీల రూపంలో పెడతామని చెప్పిన కమిషనర్ ఆ వివరాలను ఇప్పటికీ పెట్టకపోవడంతో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.