జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణించాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణించాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • ముగిసిన జిల్లా స్కూల్​​ గేమ్స్​ఫెడరేషన్​ క్రీడా పోటీలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభతో రాష్ట్ర, జాతీయ  స్థాయిలో రాణించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లా స్కూల్​ గేమ్స్​ ఫెడరేషన్​ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ ప్రోగ్రాంలో ఏఆర్​ డీఎస్పీ సత్యనారాయణ, డీఈఓ ఎం. వెంకటేశ్వరాచారి, మున్సిపల్​ కమిషనర్​ శేషాంజన్​ స్వామి, లక్ష్మీ నరసయ్య, వాసిరెడ్డి నరేశ్​కుమార్​తో పాటు పలువురు పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి

అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే కూనంనేని ఆఫీసర్లుకు సూచించారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల నాణ్యతలో లోపాలుంటే ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో మున్సిపల్​ చైర్​ పర్సన్​ కే. సీతాలక్ష్మి, మున్సిపల్​కమిషనర్​శేషాంజన్​స్వామి, తహసీల్దార్​ పుల్లయ్య, డీఈ రవి కుమార్​తో పాటు పలువురు కౌన్సిలర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కే, సాబీర్​ పాషా పాల్గొన్నారు.