
- అసెంబ్లీలో విప్గా కేపీ వివేకానంద్
హైదరాబాద్, వెలుగు: శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీవిప్గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, అసెంబ్లీలో విప్గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నియమితులయ్యారు. వారి నియామకం గురించి తెలియజేస్తూ పార్టీ చీఫ్ కేసీఆర్ఇచ్చిన లేఖను మంగళవారం స్పీకర్కు కేటీఆర్ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందజేశారు. కాగా, మంగళవారం సాయంత్రం సభ నుంచి వాకౌట్ చేశాక కేటీఆర్, హరీశ్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ తో భేటీ అయ్యారు.