
దుబ్బాక, వెలుగు: వేద పాండిత్యంలో విశేష కృషి చేస్తున్న దుబ్బాక మండలం చీకోడు గ్రామానికి చెందిన, వేద ధార్మిక సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండపాక కృష్ణమాచార్యులుకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఈ మేరకు వర్సిటీ ప్రతినిధులు ఆదివారం తమిళనాడులోని హోసూర్ క్లరిస్టా హోటల్లో డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు.
కృష్ణమాచార్యులు సినిమా రంగంలో గేయ రచనలు, కథలను సమకూరుస్తూనే వేద పాండిత్యం, రాజకీయ జ్యోతిష్యం, వాస్తు రంగంలో మంచి గుర్తింపు పొందారు. డాక్టరేట్ రావడంపై బ్రహ్మణ సంఘాల వేద పండితులు నరహరి, తిరుమల చార్యులు, లక్ష్మణాచార్యులు, సీహెచ్ కృష్ణమాచార్యులు, శ్రీధర్ అభినందనలు తెలిపారు.