
- క్రివి ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
ఖైరతాబాద్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రివి ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న 1000 మంది బాలికలు, యువతులతో ‘జానపద నృత్య ప్రదర్శన’ నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు కె.వేదకీర్తి తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా గాంధీ పీజీ కాలేజీలో శుక్రవారం ఉదయం 8 నుంచి10 గంటల వరకు నృత్య ప్రదర్శన కొనసాగుతుందన్నారు.
పదేండ్ల బాలికల నుంచి 20 ఏండ్ల లోపు యువతులు పాల్గొంటారన్నారు. ‘సేవ్ది గర్ల్చైల్డ్’ పేరుతో బాలికల హక్కులు, సాధికారత, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూనే లిమ్కా బుక్ఆఫ్వరల్డ్రికార్డు, హైరేంజ్ బుక్ ఆఫ్వరల్డ్రికార్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వేదికీర్తి నృత్యప్రదర్శన పోస్టర్లను ఆవిష్కరించి.. వివరాలు వెల్లడించారు.