జేపీఎల్ క్రికెట్ టోర్నీ షురూ

జేపీఎల్ క్రికెట్ టోర్నీ షురూ
  • జేపీఎల్ క్రికెట్ టోర్నీ షురూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేఎస్‌‌‌‌జీ జర్నలిస్ట్ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (జేపీఎల్‌‌‌‌) సోమవారం లాంఛనంగా మొదలైంది. విజయానంద్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌ను త్రుక్ష ఫుడ్స్‌‌‌‌ ఎండీ చల్లా భరత్‌‌‌‌ రెడ్డి టాస్‌‌‌‌ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఉరుకులు పరుగులు తీసే జర్నలిస్టులకు ఈ లీగ్‌‌‌‌తో ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని, ఇలాంటి లీగ్‌‌‌‌లు భవిష్యత్‌‌‌‌లో కూడా కొనసాగించాలని ఆర్గనైజరర్లకు సూచించారు. 

 అనంతరం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో థండర్స్‌‌‌‌ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌‌‌‌లో ఎన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ గెలుపొందింది. తొలి రోజు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌‌‌‌.. ప్లేయర్లను పరిచయం చేసుకొని కాసేపు బ్యాటింగ్ చేసి అలరించారు. టోర్నీ సక్సెస్ అవ్వాలని ఆశించిన ఆయన.. లీగ్‌‌‌‌ను ప్రతీ ఏడాది నిర్వహించాలని సూచించారు. కాగా, మంగళవారం జరిగే మ్యాచ్‌‌‌‌లో వీ6 టీమ్ జట్టు   తలపడనుంది.