చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కేటీఆర్, కోదండరాం

చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కేటీఆర్, కోదండరాం

 తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం  చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం ఒకే వేదికపై కనిపించారు.  

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి సంస్మరణ సభ శనివారం ( సెప్టెంబర్ 21)   రవీంద్రభారతిలో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  జరిగింది. ఈ సభలో  కేటీఆర్,  ఎమ్మెల్సీ కోదండరాం పక్కపక్కనే కూర్చున్నారు. కేటీఆర్,కోదండరాం కాసేపు పలకరించుకున్నారు.  చాలా రోజులు తర్వాతన వీళ్లు ఒకే వేదికపై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. 

సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, కోదండరాం ఈ వేదికను పంచుకోవాల్సింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మరో 5 నిముషాల్లో వస్తారని తెలియగానే కేటీఆర్ మాట్లాడి వెళ్లిపోయారు.