కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారు: కేటీఆర్

 కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారు: కేటీఆర్

హైదరాబాద్: సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. రేపురాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని మాజీ మంత్రి కేటీఆర్​ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి, తెలంగాణ తల్లిని అవమాన పరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ సెంటిమెంట్‎తో పెట్టుకున్నోళ్లెవరూ రాజకీయాల్లో బతికిబట్టకట్టలేరన్న విషయం సీఎం గుర్తుంచుకోవాలని సూచించారు.