ఓవరాక్షన్​ చేస్తున్న ఆఫీసర్లను వదలం : కేటీఆర్​

ఓవరాక్షన్​ చేస్తున్న ఆఫీసర్లను వదలం : కేటీఆర్​
  • మేం అధికారంలోకి వచ్చాక వాళ్లు రిటైరైనాపట్టుకొచ్చి లెక్క సరిచేస్తం: కేటీఆర్​
  • పోలీసులు రేవంత్​ ప్రైవేట్ ​సైన్యంలా మారిపోయారులగచర్ల 
  • ఆడబిడ్డలపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: ఓవరాక్షన్  చేస్తున్న అధికారులను వదలబోమని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామని బీఆర్ఎస్​ వర్కింగ్  ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. మానవ మృగాల్లాగా, రేవంత్​ రెడ్డి ప్రైవేట్​ సైన్యంలా పనిచేస్తున్న కొంత మంది పోలీసులు లగచర్ల ఆడబిడ్డలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. కామాంధుల్లాగా పోలీసులు మహిళలపై వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హైదరాబాద్  నందినగర్​లోని మంగళవారం కేటీఆర్  నివాసంలో లగచర్ల బంజారా మహిళలు ఆయనను కలిశారు. 

ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్  మాట్లాడారు. ఇప్పటికీ తమపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నట్లు లగచర్ల ఆడబిడ్డలు  చెబుతున్నారని అన్నారు. మూడేండ్లలో బీఆర్ఎస్​ అధికారంలోకి వస్తుందని, ఓవరాక్షన్​ చేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆ అధికారులు రిటైరై ఎక్కడున్నా పట్టుకొచ్చి లెక్క సరిచేస్తామన్నారు. మహిళలను లైంగికంగా హింసించిన పోలీసులను వెంటనే డిస్మిస్​ చేయాలని డిమాండ్​ చేశారు. లేదంటే ఈ ఘటనకు కర్త, కర్మ, క్రియ రేవంత్​ రెడ్డి అనే అనుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

 ఓ మనిషిని ఎన్ని రకాలుగా చిత్రవధ చేయాల్నో అన్ని రకాలుగా లగచర్ల రైతులను పోలీసులు చిత్రవధ చేశారని ఆరోపించారు.తనతో పాటు తన అత్తను కూడా పోలీసులు లైంగికంగా వేధించారని ఓ అమ్మాయి ఎన్​హెచ్ఆర్​సీకి ఫిర్యాదు చేసిందన్నారు. లగచర్ల భూసేకరణపై హైకోర్టు స్టే విధించినా.. ఇప్పటికీ ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నదన్నారు.