మాదాపూర్​ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం

 మాదాపూర్​ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం

మాదాపూర్ వెలుగు : మాదాపూర్​ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. షైక్ నాడియా బృందం కూచిపూడి నృత్యంతో మెప్పించింది. నవలాస్య కళా నిలయానికి చెందిన షిహాయ్స్ బృందం కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్యంతో ప్రేక్షకుల చూపులను కట్టిపడేసింది.