![రాజన్న ఆలయ ఈవోగా వినోద్](https://static.v6velugu.com/uploads/2024/07/kvinod-kumar-as-the-in-charge-eo-of-vemulawada-rajanna-temple_p3eADQvPJj.jpg)
వేములవాడ, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయ ఇన్చార్జి ఈవోగా కె.వినోద్ కుమార్ను నియమిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
హైదరాబాద్ గణేశ్ టెంపుల్ ఈవోగా పని చేస్తుండగా రాజన్న ఆలయ బాధ్యతలు అడిషనల్గా నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న ఇన్చార్జి ఈవో రామకృష్ణ హైదరాబాద్కు వెళ్లనున్నారు.