యాక్సిడెంట్ బాధితులకు ప్రథమ చికిత్స చేసిన ఎమ్మెల్యే

యాక్సిడెంట్ బాధితులకు ప్రథమ చికిత్స చేసిన ఎమ్మెల్యే

భద్రాచలం,వెలుగు : నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రోడ్డు ప్రమాదానికి గురై బాధపడుతున్న ఇద్దరు బాధితులకు ప్రథమ చికిత్స అందించి స్థానిక సత్యనారాయణపురం పీహెచ్​సీకి తరలించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.

 చర్ల మండలంలో పర్యటించేందుకు ఎమ్మెల్యే వెంకట్రావు వెళ్తున్నారు. ఇదే సమయంలో సత్యనారాయణపురం శివారున ఛత్తీస్​గఢ్​ నుంచి బైక్​పై వస్తున్న ఇద్దరిని టాటా మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది.దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తన వెహికల్​ ఆపి ఎమ్మెల్యే వెంకట్రావు అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేసి గన్​మెన్ల సాయంతో అంబులెన్స్ ద్వారా సత్యనారాయణపురం పీహెచ్​సీకి తరలించారు. దీనితో వారిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.